జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి

ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం జనసేన కార్యకర్త గల్లంకి శ్రీనివాసరావు జనసేన బ్యానర్ కట్టాడని వైసీపీ కార్యకర్తలు బీర్ బాటిల్ పగలగొట్టి శ్రీనివాసరావుపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, అక్క పొగిర్ రమణమ్మ పై పదిమంది దాడి చేశారు. ఈ క్రమంలో వారిని పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రవణమ్మ, శ్రీనివాస్ ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది.