పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన వైసీపి కార్యకర్తలు

రామచంద్రపురం, రామచంద్రపురం పట్టణం స్టీల్ వెల్ పేట వైఎస్సార్సీపి కార్యకర్తలు బి.సురేష్, ఎం.నరేష్, డి.పెద్ద, డి.చినబాబు, ఎం. నాని బాబు, ఎం. రమణ, బి.సాగర్, ఎం.సత్తిబాబు, డి. ఆశీర్వాదం, జి.దావీదు, బి.బుల్లి, ది.శేషు తదిరులు శుక్రవారం రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఎమ్మార్పిఎస్ రాష్ట్ర నాయకులు కె సాయికుమార్ ల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి మన పార్టీని ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా వారికి పోలీసు చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. జిల్లా కార్యదర్శి సంపత్, కాజులూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, 3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, ఎంపిటిసి సాక్షి శివకృష్ణ, జిల్లా పోగ్రామ్స్ కమిటీ మెంబర్ ఆరంకోటి అచ్యుతానంద్, సయ్యద్ ఫాజిల్ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.