నంద్యాలలో “మీ భవిష్యత్తు” “బాబు గ్యారెంటీ”

  • “మీ భవిష్యత్తు” “బాబు గ్యారెంటీ” కార్యక్రమాన్ని నిర్వహించిన నంద్యాల ఇంచార్జ్ ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్న జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు.

నంద్యాల: బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో వార్డు ఇంచార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆయన ఇంటి ఇంటికి పర్యటించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేసే సంక్షేమానికి సంభందించిన ష్యురిటీ బాండ్ల పంపిణీ చేశారు. మాజీ మంత్రివర్యులు నంద్యాల ఇన్చార్జ్ ఎన్.ఎం.డి ఫారుక్ మాట్లాడుతూ రాష్ట్ర సంపద పెంచడం, అభివృద్ధి చేయడం తెలుగుదేశం దేశం పార్టీకి తెలుసునని సంక్షేమం- అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందని తెలుగుదేశం పార్టీ నంద్యాల ఇంచార్జ్ ఎన్.ఎమ్.డి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, మాట్లాడుతూ నవరత్నాలపై జగన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయని, జాబ్ క్యాలండర్ అని చెప్పి యువతను మోసం చేశారని, వారంలో సీపీఎస్ రద్దని జిపిఎస్ తీసుకువచ్చారు. చివరకు నిరుద్యోగులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది శాఖ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్ పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్, జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.