యువతని, యువశక్తిని నిర్వీర్యం చేసి దగా చేసారు: మజ్జి ఫల్గుణరావు

పాలకొండ, రణస్థలంలో చేపట్టిన జనసేన నాయకులు మజ్జి ఫల్గుణరావు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అనేక అంశాలపై చేసిన మోసం, అబద్ధపు వాగ్ధానాలతో యువతని రాష్ట్ర భవిష్యత్తుని ఎలా నిర్వీర్యం చేసి అధఃపాతాలానికి తొక్కేసిందో మాట్లాడారు. ముఖ్యంగా తప్పుడు వాగ్ధానాలు చేసి స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రతి ఏడాది జనవరి నెలలో విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్, దిఎస్సి నోటిఫికేషన్, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఉద్దానం సమస్య, మత్సకార సమస్యలు, పరిశ్రమలు ఏర్పాటు వంటి అనేక విషయాలలో ఉత్తరాంధ్రని వెనక్కి నెట్టేసి యువతని, యువశక్తిని నిర్వీర్యం చేసి దగా చేసిన ప్రభుత్వంగా వైసీపీని ప్రశ్నించారు.