దేవనగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసిన యువత
- చలివేంద్రాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, గురు
నంద్యాల జిల్లా స్థానిక దేవనగర్ లో నాగుల కట్ట వద్ద ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఉచిత తాగునీటి కూలింగ్ చలివేంద్రాన్ని దేవనగర్ యువత ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్, గురు లు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన దేవనగర్ యువకులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ వేసవి కాలంలో నీటి కోసం కూల్డ్రింక్ షాప్స్ లో అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఈ చలివేంద్రం వలన వార్డు ప్రజలు దాహార్తి తీర్చుకుంటారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్దార్ రవి, సూరి, బెంసన్, శివ పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-24-at-3.54.53-PM-1024x575.jpeg)