విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసిపి ప్రభుత్వం: సిజి రాజశేఖర్

  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండ బైపాస్ నందు మోడల్ స్కూల్ నందు టీచర్లను నియమించాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేసిన సిజి రాజశేఖర్
  • పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది ఈ వైసిపి ప్రభుత్వ పరిపాలన

పత్తికొండ నియోజకవర్గం: జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ఏపీ మోడల్ స్కూల్ నందు సరైన టీచర్స్ లేక విద్యార్థులు జీవితాలు సర్వ నాశనం అవుతున్నా పట్టించుకోని ఈ వైసీపీ ప్రభుత్వం, నాడు నేడు కింద స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవు ప్రతి స్కూలు అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. ఈ ప్రభుత్వానికి రంగులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులకు సరైన విద్య అందించే టీచర్స్ ను నియమించాలని బుద్ధి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సీఎం కు విద్యార్థుపై ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఈ స్కూల్లో ఉండే టీచర్లను బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవ్వవలసింది అమ్మఒడి కాదు, పిల్లలకు సరైన విద్య అందించే మంచి ఉపాధ్యాయులు ఇవ్వాలని అన్నారు. ఈ చేతకాని సీఎంగారు పిల్లలకు మావయ్య అని చెప్పించుకోవడానికి సరిపోతాడు అంతేగాని పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలని చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు, ఈ ప్రభుత్వ పరిపాలనలో పేరుకు మాత్రమే ప్రభుత్వం కాని చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో టీచర్స్ ని నియమించాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. అలాగే ఈ ధర్నా విరమించడానికి ప్రధాన కారణం పత్తికొండ ఎంఈఓ మస్తాన్ వలి గారు ఈ స్కూళ్లకు ఒక నెల రోజుల లోపల టి జి టి మాథ్స్, పిజిటి మాథ్స్, పిజిటి బోటనీ, పిజిటి జువాలజీ, కంప్యూటర్ టీచర్, ఆఫీస్ స్టాఫ్|జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అందరిని నియమిస్తామని మీరు ధర్నా విరమించుకోవాలని హామీ ఇవ్వడంతో ధర్నా తాత్కాలికంగా విరమించుకుంటున్నాం మరో నెల రోజుల లోపల ఈ స్కూల్ నందు టీచర్ నియమించకుంటే కలెక్టరు ఆఫీస్ను ముట్టడిస్తాం అలాగే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసు ను ముట్టడిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అభిరామ్ వడ్డే, వీరేష్, రమేష్, గద్దల రాజు, చిరంజీవి నాగేశ్వరరావు, హరి రాముడు, ఈశ్వరయ్య, వెంకట్రాముడు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.