ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైకాపాకు లేదు

*రంగనాయకులపేట పినాకిని పార్క్ నందు స్వచ్ఛభారత్
*రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి
*వ్యక్తిగత విమర్శలు చేస్తే.. చూస్తూ ఊరుకోం

కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని జనసేన పార్టీ సీనియర్ నేత మరియు కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. శనివారం టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు నెల్లూరులోని 50వ డివిజన్ రంగనాయకులపేట పినాకిని పార్కులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు, అన్యాయాలు యథేచ్ఛగా జరిగాయని గుర్తు చేశారు. అలాంటి పాలనకు ప్రజలు ముగింపు పలికి, కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మద్దతు ఇచ్చారని, ఇప్పుడు ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజా రంజకంగా పాలన సాగుతున్నదని తెలిపారు. తిరుపతి గోశాల వ్యవహారంలో వైకాపా చేయకూడని రాద్ధాంతం చేస్తున్నదని, గతంలో అదే పార్టీ తిరుమలలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అలాంటి పార్టీకి నైతికంగా ప్రభుత్వంపై విమర్శలు చేయగల స్థానం లేదని చెప్పారు. మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడుతూ, ఆమె వ్యాఖ్యలకు తగిన నియంత్రణ లేకపోవడం ఆవేదనకరం అని వ్యాఖ్యానించారు. తిరుమల టికెట్లను విక్రయించిన నేపథ్యం ఆమెకు మచ్చలేని చరిత్రగా మిగిలిందని విమర్శించారు. అందుకే ప్రజలు ఆమెకు డిపాజిట్ కూడా రాలేకుండా ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడిని కూడ వైకాపా నాయకులు విమర్శించడం శోచనీయమని, ఇలాంటి మాటలు మాట్లాడే వారిని దేవుడే క్షమించడని మల్లికార్జున యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. ఇకనైనా వైకాపా నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్షాచలం రాజేష్, దాసరి పోలయ్య, వెంకట్ తల్లూరి, పవన్ యాదవ్, పెనేటి శ్రీకాంత్, మహేష్, చంటి, కె. శ్రీనివాస్, ప్రసన్న, మునిసిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మరియు పలువురు జనసేన మహిళా నాయకులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-20-at-12.55.10-PM-scaled ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైకాపాకు లేదు

Share this content:

Post Comment