వైఎస్ఆర్సిపి నాయకులు షేక్ చాంద్ బాషా కుమార్తె పై అత్యాచారయత్నం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు షేక్ చాంద్ బాషా కుమార్తె పై అత్యాచారయత్నం. మానవ మృగం హాఫిజ్ మస్తాన్ చేతిలో అత్యాచారాయత్నానికి గురైన పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నపిల్లను పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. చిన్నపిల్ల తల్లిదండ్రులును షేక్ చాంద్ భాషను అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు షేక్ చాంద్ బాషా కుమార్తె పై అత్యాచారయత్నం జరిగిందని, చాంద్ బాషా నేను వైసీపీకి చెందిన వాడిని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి నేను ఫోన్ చేసినా స్పందించలేదని, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గడపగడపకి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో తిరిగానని, నా కష్టం తెలిసినా కనీసం స్పందించలేదని, తన ఆవేదనను జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ముందు వెలిబుచ్చారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సయ్యద్ మోబినా, సయ్యద్ షాహీనా తదితరులు పాల్గొన్నారు.