యువశక్తి భారీ బహిరంగ సభ కార్యక్రమ ప్రచార సమావేశం

బుధవారం పాలకొండ నియోజకవర్గం, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో పర్యటించిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగ అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువశక్తి కరపత్రం, పాసులు, జెండాలను అందించడం జరిగింది. తదనంతరం పాలకొండ నియోజకవర్గంలోని గ్రామాలో పర్యటిస్తుండగా జంప్రకోట జలాశయం, తోటపల్లి ఎడంకాలువ సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని ఆ ప్రాంత ప్రజలకు, నేతలు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ వీరఘట్టం మండలాల జనసైనికులు పాల్గొన్నారు.