యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
పాలకొండ, 12వ తేదీ రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం అట్టలి సెంటర్లో “తప్పిడి గుళ్ళు కళాకారులను” కలిసి వాలంటరీ కమిటీ సభ్యులు సతివాడ వెంకటరమణ వారిని కలిసి కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులను ఈ ప్రభుత్వం మోసగించి వారికి ఏ విధమైన పాలసీలను ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. మరియు జనసేన పార్టీ యువ నాయకులు గర్భాపు నరేంద్ర మాట్లాడుతూ.. కళాకారుల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అమితమైన ప్రేమ ఉందని, ఆయనకు ఎక్కువగా కళాకారులను కలిసి ఆదుకోవాలని చాలాసార్లు ఆయన చెప్పారని తెలిపారు. కళాకారులు మాట్లాడుతూ.. యువశక్తి కార్యక్రమానికి హాజరై గొంతును వినిపిస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-21.56.59-1024x577.jpeg)