కూకట్పల్లి జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
కూకట్పల్లి నియోజకవర్గం: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆఫీస్ 5వ ఫేస్, రమ్య గ్రౌండ్ 3వ ఫేస్, కేపీహెబ్ బి టెంపుల్ బస్ స్టాప్, మోతీ నగర్, రాజీవ్ నగర్ (బొరబండ), బాలానగర్, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్పల్లి పలు డివిజన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు కూడా ఇదే అని అమర వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ.. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం అని అన్నారు. నేటి మన స్వాతంత్ర్య సంబరం ఎందరో సమరయోధుల త్యాగ ఫలం. భరతమాత దాస్యశృంఖలాలకు విమోచనం శుభదినం అని అమర వీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ.. వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి దినం అని అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని జనసైనికులు మరియు వీరమహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-1.35.43-PM-1024x768.jpeg)