పార్టీలో పెద్దలను విభేదాల్లోకి లాగొద్దు: మాకినీడి శేషుకుమారి

  • నా మీద బురద జల్లితే పర్లేదు కానీ పార్టీ కించపరిస్తే ఊరుకునేది లేదు.
  • ఈ పళంగా ఎలక్షన్ పెడితే భారీ మెజార్టీతో గెలుపు ఖాయం.

పిఠాపురం, ఈ పళంగా ఎలక్షన్ పెడితే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన విజయం ఖాయమని పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషు కుమారి అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితోనూ వారి వారి కుటుంబ సభ్యులతో కలిసిపోతున్న విధానం నియోజకవర్గంలో జనసేన పార్టీ, నేను అభివృద్ధి అవుతున్న విషయంపై జీర్ణించుకోలేని కొందరు ఒక పత్రికలో తనకు సంబంధం లేకుండా వాళ్ల వాళ్ల ఊహాగానాలను, లేదా కొంతమంది వద్ద సొమ్ము తీసుకుని కావాలని జనసేన పార్టీని, నన్ను కించపరచాలని వాళ్లతో ఆ పత్రికలో రాయిస్తున్నారు. పార్టీ పెద్దలతో నాకు కావాలని విభేదాలు పెడుతున్నారు. జనసేన పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నేటి వరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరితో ఎంతగా కలిసిపోయానో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసని శేషుకుమారి అన్నారు. నియోజకవర్గంలో నా వంతు ప్రజలకు సహాయం చేస్తూ ఉంటుండగా నా భర్త డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ ఆయన కూడా ఎందరికో వైద్యం అందిస్తూ, ఖాళీ సమయంలో ఆయన కూడా నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీలో పెద్దలను కించపరిస్తే ఊరుకునేది లేదు. ఇప్పటివరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసమే కష్టపడ్డాను కానీ నా గురించి కాదు. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఎసి సభ్యులు పంతం నానాజీ ఇలా మా పార్టీలో పెద్దలు ఎవరిని కూడా ఇటువంటి వివాదాల్లోకి లాగవద్దు. కొందరి తప్పుడు రాతలతో నన్ను సంప్రదించకుండా నా మీద రాసిన తప్పుడు వార్తలపై ఆ భగవంతుడే చూసుకుంటాడు అని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి అన్నారు.