దుగ్గిరాల మండల ఉపాధ్యక్షులుగా శ్రీమతి సాయి చైతన్య విజయం

ఎంతో ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగిసింది. మండల ఉపాధ్యక్షులుగా జనసేన పార్టీకి చెందిన శ్రీమతి పసుపులేటి సాయి చైతన్య విజయం సాధించారు. ఈమె ఈమని ఎంపీటీసీ – 1 గా గెలిచి ఈ పదవిని కైవసం చేసుకున్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పట్టినా, ఒత్తిడులకు గురి చేసినా శ్రీమతి సాయి చైతన్య గెలుపొందడంతో జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నేతలు శ్రీమతి సాయి చైతన్యను అభినందించారు.