వరద బాధితులకు నష్టపరిహారంగా 10,000/-రూ.లు ఇవ్వాలి!

కోనసీమలో వరదలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికీ నష్టపరిహారాన్ని అందించాలని రాజోలు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ కోరారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కంటితుడుపుగా 2000/-రూపాయలు ఇవ్వడం దారుమని.. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకి 10,000/-రూపాయిలు ఇస్తున్నారు అన్నారు. ఇక్కడ కూడా తక్షణం నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10,000/-రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.