జనసేన భీమ్ యాత్ర 15వ రోజు

కాకినాడ సిటి: జనసేన పార్టీ జగన్నాధపురంలోని కుంతి దేవి పేటలో బోడపాటి మరియా ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో తిరుగుతూ స్థానిక దళితులతో మాటా మంతి కలిపారు. తదుపరి వారితో మాట్లాడుతూ సరి అయిన ఆదాయంలేక ఇబ్బందులు పడుతుంటే పేదల నడుము విరిగేలా కరెంటు చార్జీలు అంటూ, చెత్త పన్ను అంటూ పేదల రక్తమాంసాలను ఈ వై.సి.పి ప్రభుత్వం పిండేస్తోందనీ కుటుంబాన్నే పోషించుకుంటారా లేక ఇలాంటి చార్జీలని భరిస్తారా అని ఈ ముఖ్యమంత్రికి కనీస ఆలోచన లెకపోవడం చూస్తుంటే పేదలన్నా, దళితులన్నా లెక్కలేనితనమని అర్ధమవుతోదన్నారు. అసలే ప్రభుత్వ గణాంకాల ప్రకారం బలవర్ధకమైన ఆహారం లేకపోవడం వలన పేదలు ముఖ్యంగా దళితులు అనారోగ్యకరమైన పరిస్థితులని ఎదుర్కొంటున్నారన్న విషయం అందరికీ విదితమే అనీ మరి దీనిపై దృష్టి సారించని ఈ వై.సి.పి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. తదుపరి స్థానిక అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, రేవు శ్రీనివాస్, పెద్దిరెడ్డి రాజేష్, బోడపాటి మరియా, బండి సుజాత, సత్యవతి, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.