ఆమదాలవలసలో జనంతో జనసేన కార్యక్రమం 16వ రోజు

ఆమదాలవలస నియోజకవర్గంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ ఎంపిటిసి, నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 16వ రోజు, లక్ష్మీదేవి పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధాన సమస్య పంట పొలాలకి నీటి సమస్య, వర్షాధారం మీద ఆధారపడి, పంటలు పండించవలసి వస్తుంది, సమయానికి పంట చేతికి రాకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై రైతులకు అండగా, జనసేన పార్టీ, పోరాటం చేస్తుందని రైతులకు భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీను, సంఘం నాయుడు, రమేష్, సంతోష్ నాయుడు, ప్రసాద్, బుజ్జి, మని, సాయి, మొహను, జగదీశ్ అలానే గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.