వరద బాధితులకు 25వేల సాయం.: ఎంపీ అరవింద్

మేయర్ సీటు బీజేపీకి ఇస్తే వరద బాధితులకు 25వేల సాయం చేసి తీరుతామని.. తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ ఇక పై పనిచేయదు అని ఎంపీ అరవింద్ అన్నారు. టీఆర్ఎస్..సోమరిపోతులు, కమెడియన్ల పార్టీ అని విమర్శించారు. ఒక్క పరిశ్రమను కూడా కేటీఆర్ హైదరాబాద్‌కు తీసుకురాలేకపోయారని పేర్కొన్నారు. సచివాలయానికి వెళ్లని కేసీఆర్ దేశానికి దిశ దశా చూపుతారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం నెలకు 15 లక్షల జీతం తీసుకుంటోందని ఆరోపించారు. ఆరున్నరేళ్ళుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఎస్‌ఈసీ తెలంగాణ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అని వ్యాఖ్యానించారు.