మార్కాపురం జిల్లా చెయ్యాలని కోరుతూ జెఏసీ ఆధ్వర్యంలో 2వ రోజు ఆమరణ నిరాహారదీక్ష

మార్కాపురం జిల్లా చెయ్యాలని స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్షలో కూర్చున్న జేఏసి వైస్ చైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్, జేఏసి కన్వీనర్ షేక్ సైదా, జేఏసి ఛైర్మన్ కందుల నారాయణరెడ్డి, సిపిఎం నాయకులు బాల నాగయ్య, అమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. ఈ దీక్షకు మద్దతు తెలిపిన టిడిపి గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జి అశోక్ రెడ్డి, టిడిపి అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బెల్లంకొండ శ్రీనివాసరావు, జేఏసి గిద్దలూరు కన్వీనర్, యర్రగొండపాలెం నాయకులు, జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు జిల్లా సాధన సమితి సభ్యులు.