సర్వేపల్లిలో జనం కోసం జనసేన 31వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: మనుబోలు మండలం, బద్దెవోలు రోడ్డు సంగమేశ్వర స్వామి కాలనీ నందు ఆదివారం జనం కోసం జనసేన 31వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రం, కంపెనీలు ఏర్పడని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేక యువత అల్లాడిపోతున్న రాష్ట్రం. పథకాల పేరుతో ఓట్ల రూపాయలు అవినీతి జరుగుతున్న రాష్ట్రం, ప్రజా నాయకులు అని చెప్పుకొని ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. గంజాయి స్మగ్లింగ్లో ముందుండే రాష్ట్రం, కోట్ల రూపాయల గ్రాఫిల్ మాఫియా జరుగుతున్న రాష్ట్రం, ఇసుక మాఫియా జరుగుతున్న రాష్ట్రం ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రం మన రాష్ట్రం మొదటి వరుసలో ఉండటానికి గల కారణం ఒక అవినీతిపరుడుని ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రి చేయడమే కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి నీతి నిజాయితీగల నాయకుడిని ఎన్నుకుంటారని. రాబోయే 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన సారథ్యంలో రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాజధాని నిర్మాణం జరుగుతుందని, యువత భవిష్యత్తు బాగుంటుందని మేమందరము ఆశిస్తూ ప్రజలకు వెళ్తున్నాం. ప్రజలు కూడా ఒక్క క్షణం ఆలోచించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు జాకీర్, ఖాదర్ వల్లి, కోటి, సుధాకర్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, శ్రీహరి, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.