పాలకొండ జనసేన ఆద్వర్యంలో జనసేన – గిరిసేన 39వ రోజు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, జనసేన – గిరిసేన కార్యక్రమంలో భాగంగా 39వ రోజు వీరఘట్టం మండలం పరిసర ప్రాంతంలో జనసేన పార్టీ స్టిక్కర్స్ ఆటోలకు అతికించి, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ప్రచారానికి శ్రీకారం చూట్టడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ. 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి అని అలానే వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పడాలి అని జనసేన జానీ చెప్పడం జరిగింది. రఘుమండల గణేష్, అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావార వస్తువుల ధరలు పెంచడంతో ప్రజలు చాలా అవస్థలుపడుతున్నారని, యువతకు ఉపాధి లేక జాబ్స్ తియ్యక నిరద్యోగులుగా ఉండిపోవడం తప్ప ఏమి చెయ్యలేకపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ, రాజు భూషణ్ పాల్గొన్నారు.