జనసేన పార్టీ బలోపేతం ధ్యేయంగా పనిచేయాలి: తీగల చంద్రశేఖర్

గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులతో సమావేశం గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నాడు నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు శ్రీ తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం మండల అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్ట పడిన వారికి మండల అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చామని ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే మండల కమిటీల్లో కూడా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు స్థానం కల్పించాలని సూచించారు. గూడూరు నియోజకవర్గంలోనీ మండలాల్లో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి సమావేశంలో చర్చించారు. ప్రజలకు సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించేందుకు జనసేన ఎప్పుడూ ముందుంటుందని మండల అధ్యక్షులు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, కిరణ్, రాజన్న, భాస్కర్, జమాల్ బాష, వాసు, కిషోర్, మోహన్, సాయి తదితరులు పాల్గొన్నారు.