జనం కోసం జనసేన 486వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 486వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం గంగంపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 68300 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు గారికి, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల కార్యదర్శి అరిసపు విజయ్ కాంత్, గంగంపాలెం గ్రామ అధ్యక్షులు కసిరెడ్డి పెద్దకాపు, గ్రామ ఉపాధ్యక్షులు తూపిన మంగన్నదొర, కుంచే లక్ష్మి, అరిశపు వెంకటేశ్వరరావు, కంబాల కరుణ కుమార్, కోరుమిల్లి క్రాంతి కుమార్, గుర్రం రామకృష్ణ, బొదిరెడ్డి జయప్రకాష్, కడియం శివ బాలాజీ, బల్లిన దుర్గాప్రసాద్, గట్టెం త్రిమూర్తులు, పులపర్తి అశోక్, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, మాదారపు ధర్మేంద్ర, పచ్చిపులుసు సూర్య మణికంఠ, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, రంపయర్రంపాలెం నుండి కసిరెడ్డి చంటిబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నీలాద్రిరావుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన పల్లా ప్రసాద్ కుటుంబ సభ్యులకు, నక్కా రాంబాబు(సింగం) కుటుంబ సభ్యులకు, కొరిమి సురేష్ మరియు సతీష్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.