జనం కోసం జనసేన 498వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 498వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 73500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల కార్యదర్శి బద్ధి సురేష్, జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరరావు, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గ్రామ ప్రధాన కార్యదర్శి కక్కల నూకరత్నం, సేనాపతి సాయి, వెంటపాటి దుర్గ, పడాల దుర్గ, గోపిసెట్టి వీరబాబు, యాళ్ల బాబీ, జాజుల పోసియ్య, ఇజ్జాడ శివ, నక్కన సురేష్, కక్కల రాజు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజులకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గుడివాడ జోగేశ్వరరావు, బుదిరెడ్డి నాగు మరియు రాజు, అడపా వీరేంద్ర కుటుంబ సభ్యులకు, పులిమింతల నూకరాజు, దంట వెంకటలక్ష్మి, ఉంగరాల నాగరాజు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.