సీతంపేట మండలంలో జనసేన గిరిసేన 49వ రోజు

పాలకొండ: మన్యం పార్వతిపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం దిగువ దారబ గ్రామాల్లో జనసేన గిరిసేన 49వ రోజు కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయుకులు గిరిజన నేత పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఎక్స్: జడ్పీటీసీ నిమ్మల నిబ్రమ్ బృందం పర్యటించడం జరిగింది ఈ సందర్బంగా నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలను, జరుగుతున్న అరాచక పాలన గురించి గ్రామస్థులకు తెలియజేయడమైనది.. ఆ గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామంలో కనీస అవసరాలు అయినటువంటి మంచి నీటి సదుపాయం లేకపోవడం, విద్యుత్ స్తంభాలు, కాలువలు, లేకపోవడం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రానున్నటువంటి ప్రభుత్వం మన ఉమ్మడి ప్రభుత్వం కనుక జనసేన, టీడీపీ పాలనలో ఇటువంటి సమస్యలకు ఇక ఉండవని గ్రామస్థులకు భరోసా కల్పించారు. మాజీ సర్పంచ్ సవర తోటయ్య (గ్రామ పెద్దలు) మాట్లాడుతూ నిబ్రమ్ గారు ఈ రాత్రి సమయంలో మీరు మా కోసం వచ్చి ఈ చీకటిలో మా కోసం మీరు మాట్లాడే విధానం మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నారు అని మా గిరిజన బ్రతుకుల్లులో మీరు వేలుగుగా మాకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారని ఈ సందర్బంగా ప్రజలు అభిప్రాయంగా తెలియజేస్తున్నాను అని సర్పంచ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక జన సైనికులు సీతంపేట మండల నాయుకులు సవర గంగూలి, శ్రీకాంత్, సురేష్ పాల్గొన్నారు మరియు జనసేన మండల నాయకులు సవర సింహాద్రి, రాజేష్, గణేష్ పాల్గొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.