వీరరాఘవులు కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, నుదురుపాడు గ్రామానికి చెందిన గొల్లపూడి వీరరాఘవులు జనసేన క్రియాశీలక కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న జనసైనికుడు వీరరాఘవులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం నియోజకవర్గం జిల్లా నాయకులు తడవర్తి కేశవరావు, మరియు పూర్ణలను అడిగి పూర్తి సమాచారం తీసుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చనిపోయిన కార్యకర్త యొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి పంపించి వారికి అందజేయవలసినదిగా సూచించారు. మంగళవారం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలసి వీరరాఘవులు ఇంటికి వెల్లి, వారి కుమారుడు గొల్లపూడి వెంకటేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపి, వారికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి, పవన్ కళ్యాణ్ గారు పంపిన చెక్కుని గొల్లపూడి వెంకటేశ్వరరావు కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మార్కండేయ బాబు, రవికాంత్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, పార్వతి నాయుడు, తడవర్తి కేశవరావు, జ్యోతి, కందుల సైదయ్య ఫిరంగిపురం మండల అధ్యక్షులు ఏపూరి పూర్ణ, విజయ్, అనిత, సురేష్, గ్రామ అధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాసరావు, గ్రామ నాయకులు, దాసరి సత్యనారాయణ, నాగరాజు, చెలికాని శ్రీనివాస్, ఉప్పు లక్ష్మీనారాయణ, నుదురుపాడు గ్రామ జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు.