క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

  • 5 లక్షల చెక్ అందజేసిన నాదెండ్ల

ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాపచింతలపూడి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త సానబోయిన నాగ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారికి జనసేనపార్టీ తరుపున 5లక్షలు రూపాయలు ప్రమాద భీమా చెక్కును జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.