గొల్లలగుంట గ్రామంలో జనం కోసం జనసేన 538వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 538వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, గొల్లలగుంట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 450 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 87210 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 539వ రోజు గురువారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జగ్గంపేట మండలం, గుర్రప్పాలెం పంచాయతీ, రామచంద్రపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. బుధవారం జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల జడ్పీటిసి అభ్యర్థిని మరిశే శ్యామల, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి ఇసరపు శివ, గొల్లలగుంట గ్రామం నుండి గొల్లవిల్లి దుర్గయ్య, గొంప అప్పారావు, గొంప దుర్గాప్రసాద్, యలమంచిలి వీరబాబు, కానాటి వెంకన్న, చింతాకుల దుర్గాప్రసాద్, గోపిల్లి చిన్నబ్బాయ్, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), సగరపేట గ్రామం నుండి గండికోట బాల బాలాజీ, రామచంద్రపురం నుండి గంజా శ్రీనివాస్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.