జగ్గంపేటలో జనం కోసం జనసేన 608వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 608వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,04,010 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 609వ రోజు కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. మంగళవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, ఎర్ర సాయి, సోమిశెట్టి వీరబాబు, చింతల ప్రసన్నకుమార్, కేధరి సురేష్, మల్లిరెడ్డి తేజ, రొట్టె నాగేశ్వరరావు, నేదురి అభి, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గంటా దుర్గాప్రసాద్, వెలుగుల సత్తిబాబు, గోనేడ నుండి బుర్రే వీరభద్రరావు, అనపరెడ్డి శివ, నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, పెద్ది మణికంఠ, కొలిమళ్ళ లోవరాజులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.