జగ్గంపేటలో జనం కోసం జనసేన 610వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 610వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 500 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,05,010 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 611వ శుక్రవారం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. గురువారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి ఐరాజు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి సింగం శ్రీనివాస్, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, యర్రా సాయి, ముంతా సన్ని, దొడ్డి ప్రసాద్, గొల్లపల్లి బన్ని, ఊరి శ్రీను, సలాధి రవి, మర్ల మహేష్, దొడ్డి సాయి, కాట్రావులపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణు మల్లేష్, పాటంశెట్టి చిన్నరామకృష్ణ, కాండ్రేగుల నుండి కంపిరి స్వామిలకు కృతజ్ఞతలు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు.