జనం కోసం జనసేన మహాయజ్ఞం 737వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 737వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం, ముక్కొల్లు గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 738వ రోజు కార్యక్రమం రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేటకి మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సొడసాని కామరాజు, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, ముక్కొల్లు నుండి జోల్ల విఘ్నేశ్వర రావు, చెక్కపల్లి వేణి, బందుల సూరిబాబు, ఆకేటి రామకృష్ణ, బొజ్జా పెద్దకాపు గారికి, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, సింహాద్రిపురం నుండి కందా బాబి గారికి, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, గోనేడ నుండి బుర్రే రాజు, మాదిరెడ్డి వీరభద్రం, బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గంధం ప్రభాకర్ కుటుంబ సభ్యులకు, నాగబోయినశివ కుటుంబ సభ్యులకు, లంక వీరవెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.