హుస్నాబాద్ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం స్థానిక పట్టణంలో 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెల సంతోష్, వినోద్, బొజ్జ నవీన్, కొంకటి కిరణ్, మాచర్ల శ్రీనివాస్, చిరంజీవి, అనిల్ మరియు జనసైనికులు, కాలనీవాసులు పాల్గొన్నారు.