ప్రతి ఇంటికి జనసేన 8వ రోజు

  • ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటిలో ప్రతి ఊర్లో సమస్యలే

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన గురువారం సిటియం పంచాయతీ కామిగాని పల్లి, కొత్త వారి పంచాయతీ చిలక వారి పల్లి, గాజుల వారి పల్లెలో ప్రతి ఇంటికి జనసేన 8వ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు కోటకొండ చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ బారె కిరణ్ కుమార్, పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, సిటిఎం జనసేన నాయకులు గంగాధర, వినోద్, ద్వారక నాగరాజు, మహేష్, వీరమహిళలు పాల్గొన్నారు.