జనంకోసం జనసేన – మహాపాదయాత్ర 90వ రోజు

రాజానగరం మండలం, ముక్కినాడ పాకలు గ్రామంలో “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 90వ రోజులో భాగంగా “ఆడపడుచులకు బొట్టు పెట్టె కార్యక్రమం” రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమవుతూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ ఆడపడుచులకు బొట్టు పెట్టి “గాజు గ్లాసు” గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు, ముక్కినాడ పాకలు గ్రామ వాసులు పాల్గొన్నారు.