కొమ్ముగూడెంలో జనం కోసం జనసేన 99వ రోజు

పోలవరం: బుట్టాయిగూడెం మండలం, కొమ్ముగూడెం గ్రామంలో 99వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమం మండల ఉపాధ్యక్షులు ఏలేటి ఏడుకొండలు తీగల గోపాలకృష్ణ మరియు మండల అధికార ప్రతినిధి మెట్ట బుచ్చిరాజు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి మరియు పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో గ్రామాల వారీగా మండలాల వారీగా ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారంగా చేయవలసిన పనుల గురించి తెలుపుతూ.. మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగారు. అధికార ఎమ్మెల్యే కనీసం ఇప్పటివరకు గ్రామ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని, రోడ్డు కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్న పట్టించుకోలేదని, ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వస్తే అధికారం ఎమ్మెల్యేకి మేము బుద్ధి చెప్తామని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాల్లో ప్రతి సమస్యను తీరుస్తామని, ఇచ్చిన మాట తప్పమని అభివృద్ధి చేసిన తర్వాత మీ గ్రామంలోకి వస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగుండుమోగుల సత్యనారాయణ, పూనెం రాజా, గురజాల వెంకటేశ్వరరావు, కొక్కెర పద్మరాజు, కేరం రాంప్రసాద్, వెంకటేష్, కందుకూరి కామరాజు, కొడిదల ఏసు తదితరులు పాల్గొన్నారు.