జన చైతన్య శంఖారావం కార్యక్రమం 29వ రోజు

రాజమండ్రి రూరల్: జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావం కార్యక్రమం 29వ రోజు ధవలేశ్వరం గ్రామంలో బ్యారేజ్ కాలనీ ఏరియాలో ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కందుల దుర్గేష్ గారుమాట్లాడుతూ ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఈ కార్యక్రమం ఏ గ్రామంలో ఏ గ్రామంలోకి వెళ్లినా.. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం ఏ సమస్యలను కూడా పరిష్కరించలేకపోవటం, పెద్ద పెద్ద సమస్యలను పక్కన పెట్టేస్తే మౌలిక సదుపాయాలపై ఏ రకమైన శ్రద్ధ చూపడం లేదు. ధవళేశ్వరం లాంటి పెద్ద గ్రామాలు ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు, పెదపాటి సురేష్ మందాకిని, ఎం. రవి, సూర్య, రంగాల తులసి, వీరమల్ల సత్యనారాయణ, నాగు, జిల్లా కార్యదర్శి అమీనా, మట్టపర్తి నాగరాజు, సురాడ సత్తిబాబు, వర్రె రమేష్, ఆటో బుజ్జి, మేక సత్యనారాయణ, జంగా వినోద్, మాగాపూ రాజు,దూది సాయి తదితరులు పాల్గొనడం జరిగింది.