శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బొర్రా వెంకటఅప్పారావు

  • శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంభం సుభిక్షంగా ఉండాలి
  • జనసైనికులు ఏర్పాటు చేసిన ప్రభలను సందర్శించిన బొర్రా మరియు జె.ఎస్.పి శ్రేణులు.

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, నగరికల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా, జనసేన పార్టీ శ్రేణులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి గ్రామస్థులు, జె.ఎస్.పి అభిమానులు ఆహ్వానం మేరకు సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, గ్రామస్థులు, యువత సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదములతో స్వామి వారి అశీస్సులు అందజేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామస్థులు ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభలను సందర్శించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ ప్రతి ఏడాది రైతులు, గ్రామస్థులు కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఐక్యతా భావంతో సమిష్టిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్ల మహోత్సవ వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటం మీ సంతోష సంబరాలలో మేమందరం భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించిన గ్రామస్థులందరికి అభినందనలు తెలియజేశారు. రానున్న ఏడాది పాడి పంటలతో రైతు సోదరులు, గ్రామస్తులు ప్రతి కుటుంభం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరికల్లు మండల పార్టీ అధ్యక్షులు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, రూరల్ మండలం అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, ముప్పాళ్ళమండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ఏడవ కౌన్సిలర్ వైస్ ప్రెసిడెంట్ రఫీ, కాపు రాష్ట్ర యువసేన రాష్ట్ర కాపు యువ సెక్రటరీ రామకృష్ణ బండి, వర్ధన్ కాసా, రామకృష్ణ మిరియాల, జగన్ డి, కొండ లక్ష్మీనారాయణ, పసుపులేటి పవన్ కళ్యాణ్, గ్రామస్తులు, భక్తులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.