కొటికలపూడి గోవిందరావు జన్మదిన వేడుకలలో పాల్గొన్న చిర్రి బాలరాజు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు జన్మదినం సందర్భంగా పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొని అన్నదానం చెయ్యడం జరిగింది. సుమారు 40 మందికి తల్లిదండ్రుల వయసు వారికి భోజనం వడ్డిస్తుంటే చాలా సంతోషంగా ఉందని, గోవిందరావు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమం చెయ్యడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఆశ్రమానికి జనసేన అండగా ఉంటుందని చిర్రి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, రాంపండు, హరికృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.