ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ నటన, డ్యాన్సుల ద్వారా కోట్ల సంఖ్యలో అభిమానులను చేరువయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు రీసెంట్‌గా గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే దేశ భక్తి నేపథ్యంతో తెరకెక్కిన చిత్రంలో నటించింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ త్వరలో తెలుగు తెరపై కూడా జూనియర్ ఎన్టీఅర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి తెరకెక్కనున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు గత రెండు రోజుల నుంచి జోరుగా కనిపించనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా జాన్వీ ముంబైలోని కాస్ట్ లీ ప్రాంతంగా చెప్పుకొనే జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందట జాన్వీ. ఒక ప్రముఖ వెబ్ సైట్ నివేదిక ప్రకారం 3,456 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించి జాన్వీ కొనుగోలు చేసిందట. గతేడాది డిసెంబర్‌ 7 జరిగిందని తెలుస్తుంది.