కేఎల్ రాహుల్‌కు గాయం.. కోలుకునేందుకు మూడు వారాల సమయం

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. అతని చేతి మడిమకు గాయమైంది. దీంతో అతను బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ మిగితా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో ఇంకా రెండు టెస్టులు జరగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న సమయంలో రాహుల్ ఎడమ చేతి మడమ పట్టేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌కు.. మూడు వారాల పాటు కోలుకోవడానికి సమయం పడుతుందని బీసీసీఐ చెప్పింది. దీంతో అతను ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు మిస్ కానున్నాడు. గాయం చికిత్స కోసం అతను భారత్‌కు వస్తున్నాడు. బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ఉండనున్నాడు.

కాగా ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా సభ్యలు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారన్న వార్తలు రావడంతో కరోనా టెస్టులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు సాగనుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ 1-1తో సమం చేసింది. దీంతో మూడో టెస్టుపై భారీ ఆశలు నెలకొన్నాయి.