మాకినీడి చేపట్టిన జనసేనకు ఒక్క ఛాన్స్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం పిఠాపురం మండలం జములపల్లి గ్రామంలో జరిగింది. స్థానిక కార్యకర్తలు, నాయకులు సహకారంతో శేషుకుమారి ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వలని కోరారు. స్తాస్థానిక ప్రజలు వారికి ఉన్న సమస్యలు వివరించి పరిష్కారం చేయమని విన్నవించారు. అనంతరం జాములపల్లి గ్రామంలో దళిత వాడలో యువకులు కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి జనసేన కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం వస్తే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, జనసేన పార్టీ వ్యూహాలు కరపత్ర రూపంలో వారికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ గాజు గ్లాసుకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమనికి సహకరించిన గ్రామ నియోజవర్గ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, దడాల ఏసు, రాహుల్, సాదే రవితేజ, సికోలు దొరబాబు, ఎస్ సిద్దు, శివకోటి, వడ్డీ నాగబాబు, కంద సోమరాజు, పెద్దిరెడ్డి భీమేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.