మాతృశ్రీ శ్రీ కాగితాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు గురుదత్ విరాళం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కలవచర్ల, నంబరాడ, నరేంద్రపురం గ్రామాల మధ్యలో వెలిసిన మాతృశ్రీ శ్రీ కాగితలమ్మ తల్లి వారి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా హాజరైన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని, జనసేన పార్టీ తరుపున 5016 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గురుదత్ గారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, పెముమాకుల వీరబాబు, అరవ సాయి, మేకల సాయి ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.