శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

  • ఘనంగా శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం..
  • ముందుగా ఆలయ కమిటీ సభ్యులు జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి సాదర స్వాగతం పలికారు…
  • అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..
  • ఆలయ కమిటీ వారికి 10,000/- రూపాయలు విరాళం అందించారు..

రాజానగరం: కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి ప్రసిద్ధి చెందిందని జాతర మహోత్సవంలో పాల్గొనడం సంతోషం వ్యక్తంచేసారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహా అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని జాతరకు విచ్చేసిన భక్తులకు స్వయంగా అన్నవితరణ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శీలంశెట్టి వీర్రాజు, దొడ్డి అప్పలరాజు, మద్దాల గంగాధర్, తనకల వాసు, మద్దాల దుర్గ, సూరిశెట్టి బుల్లిరాజు మరియు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.