గోపాలపురం జనసేన మండల కమిటీ కార్యవర్గ సమావేశం

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండలంలోని ఈ వారంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోల్నాటి రాజేంద్ర ఆధ్వర్యంలో మండలంలో ఉన్న గ్రామాలలోని కమిటీలకు సంబంధించి, మండల కమిటీకి సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి, పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి, జూన్ 14న జరగబోయే వారాహి యాత్రకు సంబంధించి, రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి, మరియు గోపాలపురం నుండి సాగిపాడు రోడ్డు సంబంధించి, గ్రామస్తులు పడే ఇబ్బందులు వృద్ధులు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పడే ఇబ్బందులు గూర్చి, ఆ రోడ్లో ప్రయాణం చేయడానికి భయప్రాంతులకు గురయ్యే ప్రజల గురించి, చర్చించుకోవడం జరిగింది. సాగిపాడు రోడ్డు సమస్య అధికారులకు వినిపించడానికి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులతోటి మరియు మండల నాయకులు తోటి, గ్రామ నాయకుల తోటి మరియు జనసేన తోటి వీరమహిళల తోటి, కార్యకర్తలతోటి, పాదయాత్ర చేపట్టే విధంగా కూడా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుక్కంపేట గ్రామ అధ్యక్షులు ఫణీంద్ర, ప్రగడ రాంబాబు, శ్రీను, గణపతి, సూర్య భగవాన్, ఉమామహేష్, నాగేంద్ర, పట్టపు రమేష్, నరేంద్ర, సీతయ్య, శివ, నరేష్, దుర్గారావు మరియు వీరమహిళ వీరమల్లు శాంతి, జనసైనికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.