ఘనంగా శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి జ్యోతుల శ్రీనివాసు జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము వారు ఏర్పాటుచేస్తున్నా శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయసదుపాయమును కల్పించుచున్నారు. శనివారం 44వ వారం కూడా 830 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. ఈ కార్యక్రమంలో సాయిప్రియ సేవాసమితి కార్యదర్శి మేకల కృష్ణ, పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, దుర్గాడ గ్రామానికి చెందిన జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను, విప్పర్తి కృపాకర్ తదితరులు ఆహరపానీయ వడ్డనలో తమ సేవలను అందిస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారు, సాయిప్రియ సేవాసమితికి పరోక్షంగా సేవలందిస్తున్నారని వారిని సెల్ ఫోన్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేయుచున్నానని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు.