శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

పోలవరం: స్వర్ణ వారి గూడెం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గ్రామ పెద్ద తొమ్మిదేళ్ళ వెంకటరత్నం, తొమ్మిదేళ్ళ సూర్యచంద్రం జనసేన యువ నాయకుడు తొమ్మిదేళ్ళ రవి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఎక్స్. జెడ్పీటీసీ గడ్డమనుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము హజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు, గ్రామస్థులు పాల్గొనడం జరిగింది. ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని తొమ్మిదేళ్ళ కుటుంబసభ్యులు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదానం చెయ్యడం జరిగింది, అన్నదానంలో గ్రామస్థులు పాల్గొన్నారు. సర్ణవారి గూడెం గ్రామ పెద్దలకు గ్రామస్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల మధు, సూర్యనారాయణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.