రోడ్డు ప్రమాదానికి గురైన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు

గుంటూరు: మాచర్ల మండల జనసేన ఉపాధ్యక్షులు కూరాకుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జిల్లా జనసేన కార్యదర్శి పులి హరి ఈ విషయాన్ని జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కు తెలియజేయగా వెంటనే హాస్పటల్లో ఉన్న జనసైనికుడు నాగేశ్వరరావుని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, వైద్యులను కలిసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.వారి వెంట జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, త్రినాద్, మధులాల్, కనకరాజు ఉన్నారు.