జనజాగృతి యాత్ర 80వ రోజు

రాజానగరం నియోజకవర్గంలో మేడ గురుదత్ ప్రసాద్ తలపెట్టిన జనసేన జనజాగృతి యాత్ర 80వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా జనజాగృతి యాత్రలో పాల్గొన్న సీట్ ఎవరికి మండపాక శ్రీను ఇచ్చిన గెలిపించుకుంటాం అని పవన్ కళ్యాణ్ స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారని అప్పటివరకు అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, ఫిలింనగర్ లో జనసేన జనజాగృతి యాత్ర 80వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ డైనమిక్ లీడర్ & కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన పార్టీ గాజు గ్లాసులు మరియు షణ్ముఖ వ్యూహం కరపత్రాలను ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. అలానే అడుగడుగునా ప్రజల చూపు జనసేనాని వైపే అనే విషయం ప్రజల యొక్క మాటల్లో తెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కోరుకొండ మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి విరపురాజు పోసిబాబు, కోరుకొండ మండలం సోషల్ మీడియా కన్వీనర్ రాచపోతుల సురేష్, కోరుకొండ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శివ, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, స్వామి, సుబ్రహ్మణ్యం, ఆనంద్, శ్రీనివాస్, వీరమహిళలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.