వరుస శంకుస్థాపనలతో అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్న కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

  • దల్లి గోవింద్ ఆధ్వర్యంలో బి టి రోడ్లకు శంకుస్థాపన

గాజువాక నియోజకవర్గం: 64వార్డ్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఆధ్వర్యంలో బుధవారం వెంకన్నపాలెం గ్రామంలో 19.87లక్షల రూపాయలు, కొంగ పాలెం గ్రామంలో 20లక్షల రూపాయల జివిఎంసి వారు నిధులతో.. బి టి రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా 64వ వార్డుకార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి బాధ్యత నాది .. మీకు ఇచ్చిన ప్రతి మాట తూచా తప్పకుండా పూర్తిస్థాయిలో మీకు సంపూర్ణంగా పనిచేస్తానని భరోసా ఇస్తున్నాను.. అక్కడ ఉన్న ప్రజలు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుక్క సతీష్ రెడ్డి, చిన్ని పిల్లి సురేష్, వాసు, రవి, అమర్నాథ్, శ్రీను, అప్పల రెడ్డి, గంగాధర్, జివిఎంసి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, జనసైనికులు, జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.