పవన్ వారాహి పేరిట సంపత్ వినాయకునికి గాజువాక జనసేన ప్రత్యేక పూజలు..

గాజువాక: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన అన్నవరం నుండి ప్రారంభిస్తున్న.. ప్రజావారాహీ యాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తూ.. 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించి జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, సంపత్ వినాయక గుడి వద్ద 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం జనసేన శ్రేణుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు శ్రీమతి కిరణ్ ప్రసాద్, ఎం. నాగలక్ష్మి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి వసంత లక్ష్మీ, డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి, వీరమహిళలు పిన్నింటి పార్వతి, లత, రాజేశ్వరి, రామలక్ష్మి, రూప, జ్యోతిరెడ్డి, షాలిని జనసైనికులు శిశిర్ రెడ్డి, సతీష్, ప్రసాద్, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.