జనసేనానితో బత్తుల మర్యాదపూర్వక భేటీ
మంగళగిరి, జనసేన పార్టీ కార్యాలయం నందు పార్టీ కార్యాలయ విస్తరణ కోసం భూమి పూజ మరియు ధర్మ పరిరక్షణ.. ప్రజాక్షేమం ఆకాంక్షిస్తూ.. యాగం చేపట్టిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ గౌరవపూర్వకంగా కలిసి ఇటీవల నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలపై ఇష్టా గోష్టిగా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజానగరంలో నియోజకవర్గంలో ఇటీవల కాలంలో బత్తుల బలరామకృష్ణ కుటుంబం చేపట్టిన అనేక కార్యక్రమాలు తమ దృష్టికి వచ్చాయని అభినందిస్తూ.. పార్టీ అభివృద్ధి కోసం, గెలుపు కోసం క్షేత్రస్థాయిలో మరింత శ్రమపడాల్సిన అవసరం ఉందని, ప్రజలకు అండగా ఉండడానికి మరింత బాధ్యతాయుతంగా ముందుకు వెళదామని ఈ సందర్భంగా అధ్యక్షులవారు బత్తుల బలరామకృష్ణ కు సూచించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-5.34.21-PM-830x1024.jpeg)